ప్రజాకవి అందెశ్రీ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి,డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి వెళ్లారు. లాలపేట్లోని అందెశ్రీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణం ప్రజలకు తీరని లోటని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు వారు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అందెశ్రీని గుర్తించామని పేర్కొన్నారు.