డోన్: బేతంచర్ల లో సర్ ప్రక్రియ పై ఆటో ద్వారా ప్రచారం
Dhone, Nandyal | Jul 5, 2026 ఓటర్ల ముసాయిదా జాబితా (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువు ఈనెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ కోరారు. ఈ మేరకు పట్టణంలో ఆటో ద్వారా ఆదివారం ప్రచారం చేపట్టారు. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదా ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలు వాటిని పూర్తిగా నింపి, అవసరమైన వివరాలతో అందజేయాలన్నారు.