ఒంగోలు అర్బన్: క్షౌర కార్మికుడి హత్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద నాయి బ్రాహ్మణుల నిరసన
Ongole Urban, Prakasam | Jul 3, 2026
యాంకర్ పార్ట్: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న చోటుచేసుకున్న క్షౌర కార్మికుడు మహేంద్ర హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు, క్షౌర కార్మికులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుడివాడకు చెందిన మహేంద్ర జీవనోపాధి కోసం ఒంగోలుకు వచ్చి క్షౌర వృత్తి నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి క్షౌరం చేయడానికి నిరాకరించడంతో కత్తెరతో దాడి చేసి హత్య చేసిన ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.