జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం అమీర్పేట మాజీ కార్పోరేటర్ ఎన్. శేషుకుమారి, పార్టీ అధ్యక్షుడు హనుమంర్రావు జోనల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పునర్విభజన జరిగిన తీరును పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. కరుణాకర్రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు