బనగానపల్లె: కొలిమిగుండ్లలో పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీ
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రేపు (ఆదివారం) జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు శనివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూన్ 28న ఉదయం 6 గంటల నుంచే అన్ని కేంద్రాల్లో పోలియో చుక్కల పంపిణీ ప్రారంభమవుతుందని డాక్టర్లు తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా చుక్కలు వేయించాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు.