ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంధనం పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దామని పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. సోలార్ పై ప్రజలకు అవగాహన కల్పించి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.