అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ఆవులన్న గ్రామ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ పార్మర్ ను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగలించిన ఘటనపై శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. బాధిత రైతులు రామాంజనేయులు, విశ్వనాథ, నారాయణ స్వామీలు తెలిపిన వివరాల మేరకు గత నాలుగు రోజులుగా తుఫాను ప్రభావంతో మోటార్లను ఆన్ చేయ లేదని ఇదే అదనుగా రెండు రోజుల క్రితం దొంగలు ట్రాన్స్ పార్మర్ ను ధ్వంసం చేసి కాపర్ వైర్లు, ఆయిల్ ను సైతం దోచుకెళ్లారన్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు పోలీసులను కోరారు.