సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో GRP, TGANB ఈగిల్ టీం, RPF సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా బయటపడింది. వైజాగ్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్న రూ.22 లక్షల విలువైన 44.854 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన గంజాయి పెడ్లర్ పరారీలో ఉన్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. పోలీస్ సిబ్బందిని SP చందన దీప్తి అభినందించారు.