ఓర్వకల్లు స్థానిక మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్కు సీసీ రోడ్డు ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డును పరిశీలించారు. రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, సరైన రహదారి లేక విద్యార్థులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. విద్యార్థి సంఘాల నిరంతర ఉద్యమాలు, వినతుల ఫలితంగా రోడ్డుకు మంజూరు లభించడం సంతోషకరమన్నారు. ఈ రోడ్డుకు కృషి చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత రెడ్డికి విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.