అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని పెద్దపప్పూరు మండలం శోధన పల్లి కి చెందిన మారుతి మమత మరియు గగన్ గీతాంశ్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.