ఒంగోలు అర్బన్: జిల్లాలో పారిశ్రామికీకరణను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 4, 2026
ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణను మరింత వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో ఈ దిశగా పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములు, ఇతర వనరులను గుర్తించడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను పెట్టుబడిదారులకు వివరించేలా ఇప్పటినుంచే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.