కర్నూలు: 20 కేజీల గంజాయి స్వాధీనం – నలుగురు అరెస్ట్ : కర్నూల్ నాలుగవ పట్టణ సిఐ విక్రమ్ సింహ
కర్నూలులో 20 కేజీల గంజాయి స్వాధీనం – నలుగురు అరెస్ట్ కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నాలుగో పట్టణ సీఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. అరకు నుంచి కర్నూల్ పంచలింగాలకు వైపు వెళ్తున్న AP403258 నంబర్ కారులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంచలింగాల నానిగా పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్లో ఎస్సైలు, పోలీసు సిబ్బంద