పుంగనూరు: పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా కోలాహలం నెలకొంది.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా కోలాహలం నెలకుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో దీపావళిని జరుపుకుంటారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో టపాసులు . ప్రమిదలు పూజ సామాగ్రి తదితర కొనుగోళ్లతో రద్దీగా మారాయి. పండుగ సందర్భంగా ప్రజల తాకిడితో స్వీట్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి.