కొత్తపట్నంమండలం, ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూములను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎయిర్ పోర్టు అధారిటీ నుండి వచ్చిన టెక్నికల్ టీమ్ సభ్యులు ఆయుషి రాయ్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూముల వివరాలను సంబంధిత మ్యాప్ ల ద్వారా టెక్నికల్ సభ్యులకు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, పంచాయితీ రాజ్, ఇరిగేషన్ శాఖల ఎస్.ఈ తదితరులు హాజరయ్యారు.