నందికోట్కూరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి,నందికొట్కూరు జనసేన ఇన్చార్జి నల్లమల రవికుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం రవికుమార్ జనసేన నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లమల రవికుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, అనంతరం జనసేన ఇన్చార్జ్ రవికుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు, పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ఏపీ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం అన్నారు.