మార్కాపురం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ శనగల కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సబ్సిడీపై పనిముట్లు అందించడం జరిగిందని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి రూ.20 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.