అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా చెన్నంపల్లి వద్ద జింకలు అడ్డు వచ్చి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ వ్యక్తి కి గాయాలు
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కంబదూరు మండలం చెన్నంపల్లి వద్ద జాతీయ రహదారిపై జింకలు అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో చెన్నంపల్లి గ్రామానికి చెందిన వన్నూరప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.