బనగానపల్లె: బనగానపల్లెలో ప్రారంభమైన మొహరం వేడుకలు
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మొహర్రం వేడుకలు మంగళవారం రాత్రి ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మైనార్టీలతో కలిసి పాదయాత్రగా ఆస్థానానికి చేరుకుని బంగారు పీర్లకు "పూల షేరా దట్టీ" సమర్పించారు. అనంతరం నవాబు వారసులు, మైనార్టీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బనగానపల్లెలో హిందూ, ముస్లింలు కలిసి మొహరం వేడుకలను నిర్వహించడం పట్టణ ప్రత్యేకత అని మంత్రి పేర్కొన్నారు.