కర్నూలు: కర్నూల్ నగరంలో ప్రవేట్ స్కూల్ గోడ కూలి.. ఒకరు మృతి.. పదిమందికి తీవ్ర గాయాలు
కర్నూలు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కీర్తి హై స్కూల్లో గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఉదయం కవాడి గేరిలో జరిగిన ఈ ఘటనతో నగరం ఉలిక్కిపడింది.స్థానికుల సమాచారం ప్రకారం.. స్కూలుకు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో యాజమాన్యం కొందరు విద్యార్థులను పనిష్మెంట్గా గోడ పక్కన నిలబెట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా గోడ కూలి రాఖీబి (5), ఖాజా మొహిద్దిన్ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన పది మంది గాయపడగా, వారిని స్థానికులు, పోలీసులు కర్నూలు ప్రభుత