నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమకు జీతాలను చెల్లించాలని కోరుతూ మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గత మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు, సిగ్గు అంటూ కార్మికులు నినాదాలు చేశారు. పండుగలు వేల జీతాలు ఇవ్వకపోతే ఎలా అని వారు ప్రశ్నించారు. అధికారులు తక్షణం స్పందించి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.