సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో సులేమాన్నగర్ వాసి నిజామ్ భాయ్ భార్య ఫర్విన్ బేగం (30)మృతి చెందింది. ఆమెతో పాటు వీరి బంధువులు మరో ఐదుగురు మృతి చెందారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ మేరకు భర్త నిజామ్ భాయ్ మీడియాతో మాట్లాడారు. యాత్రకు వెళ్లిన తన భార్య ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.