అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో స్వయంభూ గా వెలసిన వినాయక విగ్రహం
ఆదిలాబాద్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అద్భుత ఘటన చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గామాత మండపం వద్ద స్వయంభూగా వియకుని విగ్రహం వెలిసింది. బుధవారం దుర్గా దేవి మండపం వద్ద ఆదిలాబాద్ మున్సిపల్ కమిషన్ రాజు తో పాటు కాలనీవాసులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా వినాయకుని విగ్రహం బయటపడింది. దీంతో కమిషనర్ తో పాటు కాలనీవాసులు ఆశ్చర్యానికి గురై ఆ వినాయకుని విగ్రహాన్నీ అక్కడే ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేసారు. దుర్గమ్మ మండపం వద్ద వినాయకుని విగ్రహం బైట పడటం అంత దైవ సంకల్పమని కాలనీవాసులు పేర్కొన్నారు.