నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రౌడీషీటర్లు ఘర్షణలు అల్లర్లకుకు పాల్పడితే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరావు హెచ్చరించారు. బేతంచర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమాజంలో ప్రజాశాంతికి భంగం కలిగినా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఎస్సై రమేశ్ బాబు పాల్గొన్నారు.