నంద్యాల డివిజన్ స్థాయిలో 13 మండలాల మహిళా ఉపాధ్యాయుల మధ్య నిర్వహించిన త్రోబాల్ పోటీల్లో పాణ్యం మండలం జట్టు అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో రుద్రవరం మండలంతో జరిగిన బెస్ట్ ఆఫ్ త్రీ పోటీల్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పాణ్యం మండలం డివిజన్లో మొదటి స్థానం దక్కించుకుంది. ఈ విజయంతో పాణ్యం మండలం జట్టు జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించింది. త్వరలో డోన్, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల జట్లతో జిల్లాస్థాయిలో పోటీలు జరగనున్నాయి. అనంతరం నంద్యాల జిల్లా జట్టును రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు