రాబోయే GHMC ఎన్నికల్లో ఎస్సీ లకు కేటాయించే డివిజన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు బుధవారం నిరసనకు దిగారు. దోమలగూడ సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ను అడ్డుకొని తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం GHMC పరిధిలో 150 డివిజన్లు ఉన్న సమయంలో దళితులకు కేవలం 23 డివిజన్లను మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. దళిత జనాభా శాతం మేరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.