మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. గోకరాజు ఇంజనీరింగ్ కళాశాల నుంచి నిజాంపేట హనుమాన్ టెంపుల్ వరకు ఉన్న ఆక్రమణలను పోలీసులు కూల్చివేశారు. భవిష్యత్తులో ఎవరైనా ఫుట్పాత్లను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. పాదచారులకు ఇబ్బంది లేకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.