సికింద్రాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో కొనసాగుతున్న ఉద్యమానికి జర్నలిస్టులు మద్దతు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా జర్నలిస్టులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటయ్యే వరకు తమ కలం, గళంతో పోరాటం కొనసాగిస్తామని జర్నలిస్టులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని శనివారం పేర్కొన్న వారు, సికింద్రాబాద్ అభివృద్ధి, ప్రజల అవసరాల దృష్ట్యా ప్రత్యేక జిల్లా అవసరం ఎంతో ఉందన్నారు.