రాజేంద్రనగర్: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగుల ధర్నా
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందించారు. జీవో 34ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.