ఒంగోలు అర్బన్: ఒంగోలులో జనసేన కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
Ongole Urban, Prakasam | Jun 11, 2026
పార్టీ బలుపేతానికి తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంగోలుకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని. కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక పరిస్థితులను ఆర తీశారు. కార్యకర్తలకు ఎటువంటి సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు తెలిపారు. అతి త్వరలో జిల్లా అధ్యక్షుడిగా బాలినేని ఎన్నిక అవుతారని పుకార్లు నెలకొన్నాయి. వరుసగా కార్యకర్తలతో సమావేశమవడం ఈ పుకార్లకు మరింత బలం చేకూరుతుందని ప్రజలు అంటున్నారు. బాలినేని జిల్లా అధ్యక్షుడు అయితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.