జిల్లా వ్యాప్తంగా శనివారం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.