కర్నూలు జిల్లాలో నేర ప్రవృత్తికి చెక్ పెట్టే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.పోలీసులు వారిని సత్ప్రవర్తనతో జీవించాలని, నేర కార్యకలాపాలకు స్వస్తి పలకాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని హితవు పలికారు.భవిష్యత్తులో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంతో జిల్లాలో శాం