గుంతకల్లు: గుత్తిలో భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ
గుత్తిలో గుడ్ ఫ్రైడే,ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుత్తి ఆర్ఎస్ లోని సీఎస్ఐ చర్చి వద్ద నుంచి గుత్తిలోని సీ ఎస్ ఐ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పాటలు ఆలపించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు పట్ల భక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు డేవిడ్ నాయక్, సాల్మన్ బాబు, సెక్రెటరీ చార్లెస్, సునీల్ , బింగి బాబు తదితరులు పాల్గొన్నారు.