కుప్పం మండలంలోని తిర్లాబండ సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద నివాసముంటున్న ఓ ఇంటి వద్దకు ఒంటరి ఏనుగు రావడంతో ఇంట్లోని వారు భయంతో గజగజలాడారు. ఇటీవల కుప్పం మండలంలోని కూర్మాయి పల్లి వద్ద రైతును హతమార్చిన ఒంటరి ఏనుగు ప్రస్తుతం మరో రెండు ఏనుగులతో కలిసి సంచరిస్తోంది. అయితే రాత్రి ఒంటరి ఏనుగు తిర్లా బండ సమీపంలోని ఇంటి వద్దకు రాగా కుక్కలు గట్టిగా అరవడంతో ఒంటరి ఏనుగు వెనక్కి వెళ్లిపోయింది.