మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే మహేంద్ర అనే యువకుడు బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.