ఆత్మకూరు ఎం: మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బాలునిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బాలుడు పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం మోత్కూరు ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన బాలుడు లైంగిక దాడి చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరిపి లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. దీంతో సదరు బాలుని పై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు మోత్కూరు ఎస్సై నాగరాజు తెలిపారు.