చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలి మిట్ట సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని మదనపల్లె నుంచి పుంగనూరు వస్తున్న మినీ లారీ ఢీకొనడంతో మినీ లారీలో ఉన్న అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు ప్రదీప్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన శివశంకర్ ,డ్రైవర్ జాకీర్, అశోక్ గాయపడ్డారు. రోడ్డు ప్రమాదానికి శివశంకర్ వాహనంలోనే ఇరుక్కున్నాడు స్థానికులు సహాయంతో శివశంకర్ బయటకు తీసి 108 సిబ్బంది పుంగనూరు ఆసుపత్రిని తరలించారు. శివశంకర్. ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు 108 రాత్రి 9 గంటల ప్రాంతంలో మదనపల్లి జిల్లా ఆస్పత్రి తరలించారు.