మార్కాపురం జిల్లా పొదిలికొండ, సింగరకొండ తిరునాళ్లకు ప్రత్యేక ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు పొదిలి డిపో మేనేజర్ శంకరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చి రెండవ తేదీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. పొదిలి కొండకు మర్రిపూడి మీదుగా పది బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా సింగరకొండకు 20 ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేశామన్నారు. దర్శి ముండ్లమూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు