శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. తమకు సమాచారం లేకుండా శబరిమల వెళ్లేందుకు వచ్చిన తమ ఫ్లైట్ క్యాన్సిల్ చేయడంతో నిరసనకు వ్యక్తించేశారు. ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్పలను నిరీక్షించేలా చేయడం సరికాదని, తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి శబరిమల వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేశారు.