నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు :ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jul 8, 2026
నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వెల్లడించారు. 12న నందికొట్కూరులోని నెహ్రూ నగర్ , 13న నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో పరీక్షలు చేస్తారని చెప్పారు. అలాగే డోన్లో 14వ తేదీన కాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరం జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.