బనగానపల్లె: అవుకు మొహరం వేడుకల్లో పీర్ల స్వామికి వేసిన బంగారు గొడుగు చోరీ
నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలో మొహరం వేడుకల్లో బంగారు గొడుగు అపహరణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అవుకు తేరు వీధిలోని మౌలాలి స్వామికి లైలాన్ దారంతో కట్టి అలంకరించిన బంగారు గొడుగును దుండగులు బ్లేడుతో కత్తిరించి దొంగిలించారు. మౌలాలి ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.