షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ ఫిర్యాదు చేశారు.శనివారం కొన్ని టెలివిజన్ ఛానెల్స్ కేకే సర్వే పేరుతో ఒక పార్టీకి అనుకూలంగా ఫలితాలు చూపిస్తూ ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ సర్వే ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వేను నిర్వహించారని తెలిపారు