మార్కాపురం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిద్ర మత్తుతో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. జరిగినప్పుడు బస్సులో మొత్తం 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.