బనగానపల్లె: రాంకో సిమెంట్ పరిశ్రమ వద్ద ఈనెల 10న రైతు ధర్నా: కొలిమిగుళ్లలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య వెల్లడి
రాంకో సిమెంట్ పరిశ్రమ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 10న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య, సీపీఐ నేత సూరి పిలుపునిచ్చారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగే ఈ పోరాటానికి రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. పరిశ్రమ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ధర్నా ద్వారా గళం ఎత్తనున్నట్లు వారు స్పష్టం చేశారు.