ఆర్డిటి స్టేడియంలో 7 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి వద్ద ఆర్డిటి స్టేడియంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర గంటల వరకు 7 8 9 తేదీల్లో ఏడవ రాష్ట్రస్థాయి రెవిన్యూ క్రీడా ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ ఆర్డిటి స్టేడియం లో మూడు రోజులు పాటు ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ఆర్డీవో మలోల రెవిన్యూ సంఘం నాయకులు పాల్గొన్నారు.