మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు 12 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ కాలువలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.