చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంతను తప్పించే క్రమంలో టిప్పర్ డ్రైవర్ తన వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాద స్థలంలో ఒక గుంత తప్ప రోడ్డు సమస్యలు ఉన్నట్లు గుర్తించలేదని అన్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ ది తప్పులా కనిపిస్తుందని విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.