అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని 44 జాతీయ రహదారి సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాల సమయం ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు సమీపంలో రేమాండ్ పరిశ్రమ 479 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం జరిగిందని త్వరలోనే రైమాండ్ పరిశ్రమ ప్రారంభించబోతుందని అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు.