సంతనూతలపాడు మండలం మైనంపాడు డొంక సమీపంలో చీమకుర్తికి చెందిన బాతు పిల్లలు అమ్మి జీవనం సాగించే పేరం బాబు కుటుంబం నివాసం ఉంటుంది. తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు చెరువు అలుగు పారి సుమారు 25 వేలకు పైగా బాతు పిల్లలు మృత్యువాత పడ్డాయని గురువారం బాధితులు మీడియాకు తెలిపారు. మృతి చెందిన బాతు పిల్లల వల్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.