కరీంనగర్: కుటుంబ కలహాలతో క్రిమిసంహారక మందు తాగిన వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కరీంనగర్ రేకుర్తిలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. కోక్కర కుంట కు చెందిన నాగం బీరయ్య కుటుంబ కలహాల నేపథ్యంలో రేకుర్తిలోని తన గొర్రెల షెడ్డులో క్రిమిసంహారక మందు తాగగా కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు తెలిపారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గది కి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.