నందికోట్కూరు: సారా మానండి ప్రజాక్షేత్రంలో కలవండి:షికారి కాలనీ ప్రజలకు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో అవగాహన
నాటుసారా తయారు చేయటం వదిలేసి ప్రజా క్షేత్రంలో కలవాలని అధికారులు నీలి షికారి కాలనీ ప్రజలతో అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శుక్రవారం నీలి షికారి కాలనీలో నాటు సారా తయారీ మానుట అదేవిధంగా తమ పిల్లల్ని మంచిగా చదివిస్తే వారు ఉన్నత స్థానాల్లో కలిగే ప్రయోజనాల గురించి నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.సీఐ తో పాటు తహసిల్దార్ శ్రీనివాసులు,నంద్యాల డ్వామా ఏపీవో శ్రీనివాసులు, స్కిల్ డెవలప్ మెంట్ అధికారి వెంకటరమణ,హార్టికల్చర్ అధికారి ప్రమీల హాజరయ్యారు.ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పించడంతో పాటు,ప్రత్యామ్నా